DSC BC అభ్యర్థులకు
BOOK FUND
10 వేల మందికి నగదు అందజేత
ఏప్రిల్ 5 దరఖాస్తుకు గడువు
తెలంగాణలో డీఎస్సీ సన్నద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు శుభవార్త. ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో బుక్ ఫండ్, స్టడీ మెటీరియల్ ఖర్చును అందించనున్నారు. 7వేల మంది ఎస్జీటీ అభ్యర్థులకు, 3 వేల మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.1500 చొప్పున బుక్ ఫండ్, స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షలు మించని అభ్యర్థులు అర్హులు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 5వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 040 24071178, 27077929 నంబర్లలో సంప్రదించాలి.
డీఎస్సీకి సిద్ధమయ్యే బీసీ ఉద్యో గార్థులకు పుస్తకాల కొనుగోలు ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 అందించనున్నట్లు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. డీఎస్సీకి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు పది వేల మందికి అవకాశం ఉంటుందన్నారు. 7 వేల మంది ఎస్జీటీ, 3 వేల మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇవ్వనున్నామన్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 4వ తేదీలోపు తమ టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ వైబ్సై ట్లో లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
డీఎస్సీ ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉచితంగా రూ.1500 బుక్ ఫండ్ , స్టడీ మెటీరియల్ కు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ అభ్యర్థులు టీచర్స్ (ఎస్జీటీ, స్కూల్ అస్టెంట్)లకు 10వేల మంది బీసీ అభ్యర్థులకు (7వేల మంది ఎస్జీటీలకు, 3వేల మంది స్కూల్ అసిస్టెంట్లకు) రూ.1500 చొప్పున బుక్ ఫండ్, స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన బీసీ అభ్యర్థులు https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 5వ తేదిలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9573859598, 9441931359 నంబర్లలో సంప్రదించాల న్నారు. మరిన్ని వివరాలకు ఖమ్మం నగరంలోని బీసీ స్టడీ సర్కిల్ ను సంప్రదించాలని తెలిపారు.
ప్రకటన వివరాలు
0 Comments